దేశంలోని 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో అత్యధికంగా రూ.4,340.47 కోట్లు పొందిన కేంద్రంలోని అధికార బీజేపీ తొలి స్థానంలో నిలిచింది.గత ఆర్థిక సంవత్సరం 2022-23తో పోలిస్తే బీజేపీ ఆదాయం 83.85 శాతం పెరిగింది.దేశంలోని 6 జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం రూ.5,820.91 కోట్ల విరాళాల్లో అందులో బీజేపీ వాటా 75 శాతం కావడం గమనార్హం.కాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ నిన్న తన నివేదికలో పేర్కొంది.అయితే రూ.1225.11 కోట్లతో కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో నిలిచింది.కాంగ్రెస్ పార్టీ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 170.82 శాతం పెరుగుదలతో 772.74 కోట్లు ఎక్కువ విరాళాలు పొందింది.కాగా ఆ తర్వాత రూ.167.63 కోట్లతో సీపీఐ(ఎం),రూ.64.77 కోట్లతో బీఎస్పీ,రూ.22.68 కోట్లతో ఆప్, రూ.22.44 లక్షలతో ఎన్సీపి వరుసగా నిలిచాయి.
ఆప్, ఎన్పీపీ తమ ఆదాయానికి మించి ఖర్చులు
బీజేపీ తన ఆదాయంలో రూ.2,211.69 కోట్లు (50.96 శాతం) వ్యయం చేయగా.. కాంగ్రెస్ పార్టీ రూ.1025.24 కోట్లు (83.69 శాతం) ఖర్చు చేసినట్టు ఏడీఆర్ తెలిపింది.సీపీఐ (ఎం) రూ.127.28 కోట్లు (75.93 శాతం), బీఎస్పీ రూ.43.18 కోట్లు (66.67 శాతం) ఖర్చు చేశాయి.ఆప్, ఎన్పీపీ తమ ఆదాయానికి మించి ఖర్చులు చేసినట్టు ఏడీఆర్ నివేదించింది. ఆప్ రూ.34.09 కోట్లు ఖర్చు చేసింది.