రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో పైలెట్లు అవసరమవుతాయి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రయాణికుల సంఖ్య ఏడాదికేడాదికి పెరుగుతుందని దానికి అనుగుణంగా విమానయాన సంస్థలు విమానాలు సిద్దం చేసుకుంటున్నాయని అన్నారు. భారత్ లో సివిల్ ఏవియేషన్ సెక్టార్ వేగంగా విస్తరిస్తోందన్నారు. రానున్న 15-20 సంవత్సరాలలో దాదాపు 30వేల పైలెట్లు అవసరమవుతారని అంచనా వేశారు.
200 శిక్షణ విమానాలు కొనుగోలుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశీయంగా 800 విమానాలు సేవలందిస్తున్నాయని 6-7 వేల మంది పైలెట్లు పనిచేస్తున్నారని అన్నారు. ఇప్పటికే పలు సంస్థలు 1700 విమానాలు ఆర్డర్ పెట్టినట్లు తెలిపారు. భారత్ ను ట్రైనింగ్ కు కూడా హాబ్ గా మార్చాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఏవియేషన్ రంగం అభివృద్ధి కోసం ఒక సమిష్టి విధానంతో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రానున్న 15-20 ఏళ్లలో 30వేల పైలెట్ల అవసరం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
By admin1 Min Read