నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.దర్యాప్తులో భాగంగా ఇప్పటికే జప్తు చేసిన రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది.ఢిల్లీ, ముంబై, లక్నోలో ఉన్న ఆస్తులపై ఈడీ నోటీసులు అతికించినట్లు వెల్లడించింది.సంబంధిత ఆస్తులను ఖాళీ చేయాలని లేదా వాటి అద్దెను బదిలీ చేయాలని ఆదేశించింది.ఈ చర్యలు పీఎంఎల్ఏ చట్టం కింద తీసుకున్నవని పేర్కొంది. నేషనల్ హెరాల్డ్ పత్రికను అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) ప్రచురిస్తుండగా, దీనికి యాజమాన్య సంస్థగా ‘యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్’ ఉంది. ఈ సంస్థ ప్రమోటర్లలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారు.కాంగ్రెస్కు ఏజేఎల్ బకాయిపడ్డ రూ.90 కోట్లను వసూలు చేసుకునే విషయంలో ‘యంగ్ ఇండియన్’లో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి.ఈ మేరకు 2023 నవంబర్లో ఈడీ రూ.90.21 కోట్ల విలువైన షేర్లు, స్థిరాస్తులను జప్తు చేసింది.ఈ కేసులో సోనియా,రాహుల్, మల్లికార్జున్ ఖర్గే, పవన్ కుమార్ బన్సల్లను విచారించిన ఈడీ, వారి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. తాజా నోటీసులతో కేసులో మరో ముందడుగు పడినట్లైంది.
Previous Articleమానవుల నివాస స్థానంగా సముద్ర గర్భం…!
Next Article అమెరికా:- జార్జియాలో హిందూ ఫోబియాపై బిల్లు