ఇస్రో మరో కీలక పనిని పూర్తి చేసింది.పీ.ఎస్.ఎల్.వీ-సీ60 స్పేడెక్స్ మిషన్ లో భాగంగా సెకండ్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తైనట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా శాటిలైట్స్ ను స్పేస్ లోనే అనుసంధానం చేసే మిషన్ ను ఇస్రో చేపట్టిన సంగతి తెలిసిందే. స్పేస్ డీ-డాకింగ్ ను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో మార్చి 13న వెల్లడించిన సంగతి తెలిసిందే. స్పేస్ షిప్ లు సొంతంగా డాక్ అయ్యే విధంగా చేయడంలో ఇదొక కీలక ముందడుగు. పీ.ఎస్.ఎల్.వీ-సీ60 స్పేడెక్స్ మిషన్ ను 2024 డిసెంబర్ 30న ప్రయోగించాం. ఆ తర్వాత మొదటి సారిగా శాటిలైట్లను ఈ ఏడాది జనవరి 16న విజయవంతంగా అనుసంధానించాం. అదేవిధంగా మార్చి 13న వాటిని అన్ డాకింగ్ చేశాం. రాబోయే రెండు వారాల్లో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు