ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తున్న సంగతి ప్రపంచమంతా తెలిసిన విషయమే. తమ దేశం అటువంటివి ప్రోత్సహించదని మాత్రం పైకి నీతులు చెప్పే దాని వంకర బుద్ది మరోసారి తేటతెల్లమైంది. ఇటీవల పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ తో విరుచుకుపడి ఉగ్రవాదులను ఏరి పారేసింది. ఆ దాడులలో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఆ దేశ సైనికాధికారులు , ప్రభుత్వ అధికారులు హాజరై నివాళులు అర్పించారు. దానికి సంబంధించిన ఫొటోనూ భారత హై కమిషనర్ విక్రమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టి పాక్ దుర్బుద్ధిని ప్రపంచానికి తెలిపారు. పాక్ ఏస్థాయిలో ఉగ్రమూకలను తయారుచేస్తుందనే దానికి ఇదొక కీలక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరణించిన వారిలో 1999 కాందహార్ లో IC 814 ఫ్లైట్ హైజాక్ లో కీలక సూత్రధారి రవుఫ్ అజర్ కూడా ఉన్నాడు.
ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ అధికారులు… ఫోటో విడుదల చేసిన భారత్
By admin1 Min Read