భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వలన తమకు జరిగిన నష్టాన్ని పాకిస్థాన్ ఇప్పుడిప్పుడే మెల్లగా తెలుపుతోంది. 11 మంది సైనికులు మరణించారని 78 మంది గాయపడ్డారని తాజాగా వెల్లడించింది. 40 మంది పౌరులు మరణించారని 121 మంది గాయపడ్డారని వెల్లడించింది. ఈమేరకు పాకిస్థాన్ సైన్యానికి చెందిన డీజీ ఐ.ఎస్.పీ.ఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. నిన్న పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ తమ దేశం ఎయిర్ ఫోర్స్, నేవీ ఆఫీసర్లు తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ఫైటర్ జెట్ స్వల్పంగా ధ్వంసమైందని తెలిపారు. పాకిస్థాన్ చెబుతున్న దాని కంటే నష్టం ఎక్కువగానే ఉండి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మన ఎయిర్ మార్షల్ ఏకే భారతీ మీడియాతో మాట్లాడుతూ పాక్ జెట్ లను కూల్చిన విషయాన్ని ధ్రువీకరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు