స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు త్వరలో భారతదేశంలో అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఎలాన్ మస్క్కి చెందిన స్టార్లింక్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఈ సేవలను అందించనుంది. ఈ సేవలు ముఖ్యంగా గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలకు వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ను అందించడానికి దోహదం చేయనున్నాయి. ఇక అవసరమైన లైసెన్సును టెలికాం విభాగం జారీ చేసింది. భారత్లో ఈ రకమైన లైసెన్సు పొందిన మూడవ కంపెనీగా స్టార్లింక్ నిలిచింది. ఇప్పటికే యూకేకు చెందిన యులెసాట్ వన్వెబ్,భారతీయ దిగ్గజం రిలయన్స్ జియో ఈ లైసెన్సును పొందాయి. ఈ సర్వీసులు ప్రారంభించేందుకు అవసరమైన ట్రయల్ స్పెక్ట్రమ్ను దరఖాస్తు చేసిన 15 నుండి 20 రోజుల్లోగా మంజూరు చేస్తామని టెలికాం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇది కంపెనీకి త్వరితంగా సేవలు పరీక్షించేందుకు మార్గం ఏర్పరిచే అవకాశం కల్పిస్తుంది.
భారత్ లో ఎలాన్ మస్క్ ‘స్టార్ లింక్ ‘ ఇంటర్నేట్ కు గ్రీన్ సిగ్నల్
By admin1 Min Read