ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇంజినీరింగ్ వండర్ రైల్వే వంతెన అయిన జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు. ఈ అద్భుతమైన నిర్మాణంతో కశ్మీర్ వ్యాలీ దేశంలోని మిగిలిన ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా అనుసంధానమైంది. ఇది ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (యూఎస్బీఆర్ఎల్) ప్రాజెక్టులో అత్యంత కీలకమైన భాగం. ప్రధాని మోడీ ఈ ప్రతిష్ఠాత్మక వంతెనను అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ వంతెన ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ భారతదేశపు మొట్టమొదటి కేబుల్-స్టేయిడ్ రైల్వే వంతెన అయిన అంజి వంతెనను కూడా ప్రారంభించనున్నారు. ఇది కూడా ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తుంది. ఇక వీటితో పాటు, శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా, శ్రీనగర్ మధ్య రెండు కొత్త వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైళ్ల రాకతో, మొత్తం 272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (యూఎస్బీఆర్ఎల్) ప్రాజెక్ట్ మార్గం పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. జమ్మూకశ్మీర్ లో ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పనతో టూరిజం కు మరింత ప్రోత్సహించడంతో పాటు, అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని భావిస్తున్నారు. ఏప్రిల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సరిహద్దు దాటి చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత ప్రధాని మోడీ జమ్మూకశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించిన ప్రధాని మోడీ
By admin1 Min Read