ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడులతో పశ్చిమాసియా ప్రాంతం మరింత ఉద్రిక్తతకు లోనైంది. ఇక ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్లో నివాసముంటున్న భారతీయుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అక్కడి భారత రాయబార కార్యాలయాలు అలెర్ట్ గా ఉండాలనే సూచనలతో కూడిన అడ్వైజరీలు విడుదల చేశాయి. భారతీయులు అనవసర ప్రయాణాలు చేయవద్దని, పరిస్థితిని బట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించాయి. ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులకు కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా.. ‘ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులంతా అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారులు చెప్పే భద్రతా ప్రమాణాలను పాటించండి. ఎప్పటికప్పుడు ఎంబసీల సోషల్ మీడియా ఎకౌంట్లు అనుసరించి తాజా సమాచారం తెలుసుకోండి. అనవసర ప్రయాణాలు చేయొద్దు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు చేరుకొనేందుకు సిద్ధంగా ఉండండాలని అడ్వైజరీలో పేర్కొంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు