హిందువులకు తీర్థయాత్రలలో అమర్నాథ్ యాత్ర అత్యంత విశిష్టమైనది. హిమాలయ శ్రేణుల్లో కొలువుదీరిన మంచులింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివెళతారు. ఈ నెల 2న ప్రారంభమైన ఈ యాత్ర తాజాగా జమ్ముకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో మరోసారి వాయిదా పడింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పహల్గామ్, బాల్టాల్ మార్గాల నుండి కొనసాగుతున్న యాత్రను ఒక రోజు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. భారీగా కురుస్తున్న వర్షం కారణంగా ట్రెక్కింగ్ మార్గాలు జారడంతోపాటు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో, ముందు జాగ్రత్తచర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూలై 18న యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి బయలుదేరే అమర్నాథ్ యాత్రలను నిలిపివేసినట్టు జమ్మూకాశ్మీర్ రాష్ట్ర సమాచార శాఖ తెలిపింది.వాతావరణ పరిస్థితులను బట్టి రేపు యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు