మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.ఈ మేరకు అభివృద్ధి,సుపరిపాలన గెలిచాయని ఆయన పేర్కొన్నారు.మహారాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక విజయం అందించారని ఆనందం వ్యక్తం చేశారు.మహారాష్ట్ర ఓటర్లు, మహిళలు, యువతకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు.ఐక్యంగా ఉండడం వల్ల మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని
ప్రధాని అభిప్రాయపడ్డారు.మహారాష్ట్ర అభ్యున్నతికి మహాయుతి కూటమి కృషి చేస్తుందని హామీ మోదీ ఇచ్చారు.
కాగా ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనా ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు.ఝార్ఖండ్ లో అధికార జేఎంఎం కూటమి విజయం సాధించినందుకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.అలానే విపక్షంగా ప్రజల సమస్యలను లేవనెత్తడంలో,రాష్ట్రం కోసం పనిచేయడంలో ఎల్లప్పుడూ ముందుంటామని వెల్లడించారు.