ఇజ్రాయెల్ – హిజ్బుల్లా మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించింది.ఈ అంశాన్ని ఎక్స్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోస్ట్ చేశారు.‘శుభవార్త…నేను ఇజ్రాయెల్ – లెబనాన్ల ప్రధానులతో మాట్లాడాను.టెల్అవీవ్ – హిజ్బుల్లాల మధ్య విధ్వంసకర ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని ఆమెరికా చేసిన ప్రతిపాదనను వారు అంగీకరించారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయమని బైడెన్ అన్నారు.కాగా ఆమెరికా దౌత్యంతో లెబనాన్లో యుద్ధానికి ముగించడానికి మార్గం సుగమమయింది.ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం ఆమోదించడంతో లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు ఆగిపోయాయి.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్ నుండి వైదొలగల్సి ఉండగా, లెబనాన్ సైన్యం తమ సరిహద్దులోని భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకుంటుంది.ఇక ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చింది. రానున్న రోజుల్లో గాజాలో కాల్పుల విరమణ,బందీల విడుదలకు ఆమెరికా, టర్కీ,ఈజిప్ట్,ఖతార్ దేశాల నాయకులతో చర్చలు జరుపుతామన బైడెన్ వివరించారు.
కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షించారు.లెబనాన్ తాత్కాలిక ప్రధాని నజీబ్ మికాలి ఈ ఒప్పందాన్ని స్వాగతించారు.మరో వైపు ఈ పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యూహు కూడా స్పందించారు.ఈ ఒప్పందం ఎన్ని రోజులు ఉంటుందనేది లెబనాన్ పైనే ఆధారపడి ఉందన్నారు.ఈ ఒప్పందాన్ని తాము అమలు చేస్తామని,కానీ ఉల్లంఘనలు జరిగితే మాత్రం బలంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.