Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » భారత మాజీ క్రికెటర్ అమర్ నాథ్ జ్ఞాపకాలతో సిద్ధం చేసిన’ఫియర్ లెస్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి జై శంకర్
    జాతీయం & అంతర్జాతీయం

    భారత మాజీ క్రికెటర్ అమర్ నాథ్ జ్ఞాపకాలతో సిద్ధం చేసిన’ఫియర్ లెస్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి జై శంకర్

    By adminNovember 29, 20242 Mins Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    భారత మాజీ లెజెండరీ క్రికెటర్ మొహిందర్ అమర్ నాథ్ జ్ఞాపకాలతో సిద్ధం చేసిన ‘ఫియర్ లెస్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ పాల్గొన్నారు. భారత విదేశాంగ విధానంలో అవలంభిస్తున్న తీరు, అంతర్జాతీయ వేదికలపై భారత్ దూకుడును క్రికెట్ తో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పాక్ విషయంలో మారిన భారత వైఖరిని ఆయన క్రికెట్ తో పోలుస్తూ చెప్పారు.
    1983 భారత క్రికెట్ కు ఒక టర్నింగ్ పాయింట్ అనడంలో అతిశయోక్తి లేదని అన్నారు. పాకిస్థాన్ ఓ దశలో ప్రపంచ కప్పును గెలిచింది. శ్రీలంక కూడా గెలుచుకొంది. కానీ, 1983 అనేది క్రికెట్ చరిత్రలోనే కీలక మలుపు. ఎందుకంటే ఆ తర్వాత భారత క్రికెట్ ఏవిధమైన మార్పులు చూసిందో అదే విధంగా విదేశాంగ విధానం, క్రికెట్ లో వచ్చే మార్పులతో పోల్చడానికి ఎప్పుడూ ఇష్టపడతానని అన్నారు. చాలామంది విదేశాంగ విధానాన్ని చదరంగంతో పోల్చేందుకు ఇష్టపడతారని అయితే దానికి, దీనికి ఎలాంటి పోలిక లేదు. విదేశాంగ విధానం క్రికెట్లానే ఉంటుందన్నారు. విభిన్నంగా ఆలోచించడం, మానసికంగా సిద్ధంగా ఉండటం, ఎదుటి వారి ఆలోచనలు పసిగట్టడం సంక్లిష్టమైన విషయాలను ప్రజలకు వెల్లడించడంలో క్రికెటర్లతో సారూప్యతలు ఉంటాయని పేర్కొన్నారు.
    ప్రపంచం ఎటువంటి భారత్ తో డీల్ చేయాలనుకుంటోందో అలాంటి భారత్ ప్రస్తుతం ఉందని అన్నారు. ప్రపంచ వ్యవహారాల్లో మంచి ప్రమాణాలను నెలకొల్పుతోందన్నారు. ఈసందర్భంగా పాకిస్థాన్ లో భారత జట్టు 1982-83లో పర్యటించిన సందర్భాన్ని గుర్తు చేశారు. అక్కడ మనవాళ్లు సంప్రదాయ ఆటతీరు నుంచి బయటకొచ్చి.. దూకుడును ఎంచుకొని మెరుగ్గా ఆడారని అన్నారు. పాక్ విదేశాంగ విధానంలో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ దొరకదని జైశంకర్ విశ్లేషించారు.
    ఇక మొహిందర్ అమర్నాథ్ భారత మాజీ సీనియర్ క్రికెటర్.ఆయన 1969-89 మధ్యలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. టెస్టుల్లో 4,378 పరుగులు చేశారు. 1983 వన్డే ప్రపంచకప్ సెమీస్, ఫైనల్స్లో మొహిందర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. ఆయన మొత్తం 9 శతకాలు చేయగా..7 విదేశీ గడ్డపైనే సాధించడం విశేషం.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఅబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ సీఎం జగన్ గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: ఏపీసీసీ చీఫ్ షర్మిల
    Next Article వారాంతంలో దేశీయ సూచీల జోరు..!

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.