Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఆలోచనలు అవసరం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
    జాతీయం & అంతర్జాతీయం

    భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఆలోచనలు అవసరం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

    By adminDecember 2, 20242 Mins Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    భారత జీడీపీ వృద్ధి రేటు గత రెండేళ్ల కనిష్టానికి పడిపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి నూతన ఆలోచనలు, నూతన వ్యాపార ఒప్పందాలు ఆవశ్యకమని అన్నారు. కేవలం కొందరు బిలియనీర్లు మాత్రమే ఆర్థిక ప్రయోజనాలు పొందుతాన్నారని దీంతో ప్రగతి సాధ్యం కాదని అన్నారు. అందరికీ సమానంగా ముందుకు వెళ్లే అవకాశం లభిస్తేనే, మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. భారత దేశ జీడీపీ వృద్ధి రేటు రెండు సంవత్సరాల్లో అత్యంత తక్కువ స్థాయికి, 5.4% కి చేరుకుంది. రైతులు, కూలీలు, మధ్యతరగతి మరియు పేదలు అనేక ఆర్థిక సమస్యలతో పోరాడుతూనే ఉన్నారని తెలిపారు.
    రాహుల్ ప్రస్తావించిన అంశాలు:
    రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ఠ స్థాయికి 6.21% కి చేరుకుంది. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ సంవత్సరం బంగాళాదుంపలు మరియు ఉల్లిపాయల ధరలు దాదాపు 50% పెరిగాయి. రూపాయి విలువ 84.50 వద్ద తక్కువ స్థాయికి పడిపోయింది. నిరుద్యోగం ఇప్పటికే 45 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టింది.
    గత 5 సంవత్సరాల్లో కూలీలు, ఉద్యోగులు మరియు చిన్న వ్యాపారుల ఆదాయం స్థిరంగా ఉంది లేదా గణనీయంగా తగ్గింది.
    ఆదాయం తగ్గడం వలన డిమాండ్ కూడా తగ్గింది. 10 లక్షల కంటే తక్కువ ధర కలిగిన కార్ల విక్రయాల్లో వాటా 2018-19 లో 80% ఉండగా, ఇప్పుడు 50% కంటే తక్కువకు పడిపోయింది.
    తక్కువ ధర గల ఇళ్ల మొత్తం విక్రయాలలో వాటా గత సంవత్సరం 38% ఉండగా, ఇప్పుడు సుమారు 22% మాత్రమే ఉంది. ఎఫ్.ఎం.సీ.జీ ఉత్పత్తుల డిమాండ్ ఇప్పటికే తగ్గుతూ వస్తోంది.
    కార్పొరేట్ పన్నుల వాటా గత 10 సంవత్సరాలలో 7% తగ్గింది, కానీ ఆదాయ పన్ను 11% పెరిగింది.
    నోట్లు రద్దు మరియు జీఎస్టీ ప్రభావం వల్ల ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం వాటా గత 50 ఏళ్లలోనే అత్యల్పం 13%కి తగ్గింది.
    కొత్త ఉద్యోగాల అవకాశాలు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వస్తాయి? అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleనటనకు రిటైర్మెంట్…నటుడు పోస్ట్ వైరల్
    Next Article అదరగొట్టేలా ‘పీలింగ్స్‌’.. అల్లు అర్జున్‌-రష్మిక డ్యాన్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.