రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను మరోసారి న్యూఢిల్లీ నుండే పోటీ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత,ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గం నుండి ఢిల్లీ మాజీ సీఎం వారసులు బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు సార్లు ఢిల్లీ సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్, మరోవైపు బీజేపీ నుండి మాజీ సీఎం సాహిబ్ సింగ్ కుమారుడు పర్వేష్ వర్మను అభ్యర్థులుగా ప్రకటించవచ్చు అనే వార్తల నేపథ్యంలో ఈస్థానంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషీ సైతం ఆమె పాత నియోజకవర్గమైన కాల్కాజీ నుండి పోటీ చేయబోతున్నట్టు కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం సాధించి నాలుగో సారి అధికారులతో వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆసక్తికర పోటీ: గెలుపుపై కేజ్రీవాల్ ధీమా
By admin1 Min Read