కేరళ రాష్ట్రంలో ‘మంకీపాక్స్’ కలకలం రేపుతోంది. కొత్తగా కేరళలో రెండు కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇటీవల యూఏఈ నుండి వచ్చిన ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వయనాడ్ కు చెందిన ఒక వ్యక్తికి మొదట మంకీపాక్స్ నిర్ధారణ కాగా, తాజాగా కన్నూర్ జిల్లాకు చెందిన వ్యక్తికి వచ్చినట్లు తేలింది. దీంతో అధికారులు వారితో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ లో కూడా ఈ మంకీ పాక్స్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు