విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట పేరుతో కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొని నిరసనలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ స్పందించారు. కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ గళమెత్తిన ప్రజానీకానికి తోడుగా, ప్రజల తరఫున చేపట్టిన నిరసనలను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. పార్టీ పిలుపునకు స్పందించి ప్రజలకు బాసటగా నిలుస్తూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు. ప్రజల పక్షంగా, ప్రజాసమస్యలపట్ల పార్టీ శ్రేణులు కనబరుస్తున్న అంకితభావానికి, చిత్తశుద్ధికి హ్యాట్సాఫ్ అంటూ జగన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

