విశాఖపట్నంలోని చిల్డ్రన్స్ ఎరినా వేదికగా నిర్వహిస్తున్న డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ లో విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రానున్న 5 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యూనివర్సిటీల ర్యాంకింగ్స్ పెరిగేలా పని చేస్తున్నట్లు ఈసందర్భంగా లోకేష్ తెలిపారు. ఇది సాధించి ఈ దేశం ముందు నిలబడతామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రధాని మోడీ రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇస్తున్నారని వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణతో ప్రతి జిల్లాని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ISB తెచ్చిన మోడల్ లోనే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏఐ యూనివర్సిటీ తెస్తున్నట్లు వెల్లడించారు. ఇక నేడు ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్ కు రానున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన రాకతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఏపీ రైల్వే జోన్ కల నెరవేరనుందని టీడీపీ ఒక ప్రకటనలో తెలిపింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు