జగన్ అధికారంలో ఉండి ఉంటే.. ఈ 7 నెలల్లో ఏ ఏ పథకాలు వచ్చేయో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందనీ ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా స్ధానిక ప్రజా ప్రతినిధులతో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన నేడు సమావేశం నిర్వహించారు. ఈ సంక్రాంతికి అన్నదాతలకి రైతు భరోసా, చిరు వ్యాపారులకి జగనన్న తోడు, అక్క చెల్లెమ్మలకి ఆసరా వచ్చి ఉండేదని పేర్కొన్నారు. తమ హాయాంలో మేనిఫెస్టోను చెప్పినట్లుగా చేసి చూపించామని తెలిపారు. నాయకుడు అనే వాడికి క్యారెక్టర్, క్రెడిబిలిటీ ముఖ్యమని పేర్కొన్నారు.చంద్రబాబు చెప్పిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలన్నీ గాలికి ఎగిరిపోయాయని ఆక్షేపించారు. సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వం అక్రమాల్ని గ్రామస్థాయి నుంచే ప్రశ్నిస్తూ.. నిలదీయాలని సూచించారు. వైయస్ఆర్సీపీ జెండా మోసే ప్రతి కార్యకర్తకీ గొప్పగా చూసుకునే బాధ్యత తీసుకుంటామని జగన్ భరోసానిచ్చారు.
జగన్ ఉండుంటే ఏ ఏ పథకాలు వచ్చేయో అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది
By admin1 Min Read