వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహనం కింద ఒక సింగర్ అనే వ్యక్తి పడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటన పై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. జగన్ కారు కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకం. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది ఈ ఘటన. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి ? 100 మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్ గారు చేతులూపడం ఏంటి? అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు ? బెట్టింగ్ లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా ? ఇదేం రాజకీయం ? ఇదెక్కడి రాక్షస ఆనందం ? మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా ? ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా ? కార్ సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా ? ఇది పూర్తిగా జగన్ గారి బాధ్యత రాహిత్యాని అద్దం పడుతుందని దుయ్యబట్టారు.
సింగయ్య మృతికి కారణమైన జగన్ గారు, 100 మందికి అనుమతి ఇచ్చి వేల మందితో వచ్చినా దగ్గరుండి మరి చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని విమర్శించారు.
పర్మిషన్ కి విరుద్ధంగా జన సమీకరణ జరుగుతుంటే పోలీసులు ఎలా సహకరించారు ? ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు ? ఎందుకు ఇంటలిజెన్స్ వ్యవస్థను నిద్ర పుచ్చారు ? అంటూ ప్రశ్నించారు.
ప్రజా సమస్యలపై పోరాడితే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా? కాంగ్రెస్ చేసే ఉద్యమాలకు, ధర్నాలకు హౌజ్ అరెస్ట్ లు చేస్తారు. దీక్షలను భగ్నం చేస్తారు. ర్యాలీలను తొక్కిపెట్టి మా గొంతు నొక్కుతారు. వైసీపీ చేసిన బలప్రదర్శనలకు, హత్యలకు జగన్ గారు ఏం సమాధానం ఇస్తారు ? కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది ? ఏం చర్యలు తీసుకుంటున్నారు ? అని షర్మిల ప్రశ్నించారు.
YCP @YSRCParty అధ్యక్షులు జగన్ మోహన్
రెడ్డి @ysjagan గారి వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకం. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది ఈ ఘటన. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి ? 100 మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్… pic.twitter.com/gcYTGdWbtM— YS Sharmila (@realyssharmila) June 22, 2025