రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం పట్ల ఏపీసీసీ చీఫ్ షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడ ?అని ప్రశ్నించారు. బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. అదానీ అక్రమ డీల్ పై ఎందుకు పెట్టలేక పోతున్నారు? అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా ? మాజీ ముఖ్యమంత్రి స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే , నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత మీది కాదా? మీరు కూడా అదానీకి అమ్ముడుపోయారా? తీగ లాగితే మాజీ ముఖ్యమంత్రితో పాటు, అదానీని సైతం అరెస్టు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా? నోరు విప్పకుండా, విచారణ చేయకుండా మౌనంగా ఉండేందుకు అదానీ మీకు ఎంత లంచాలు ఆఫర్ చేశారు? అంటూ ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా.. SECIతో చేసుకున్న ఒప్పందంలో భారీ అవినీతి అన్నారు. ఈ డీల్ రద్దు చేయాలని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ద్వారా హైకోర్టులో కేసు కూడా వేపించారు. తాము అధికారంలో వచ్చాక నిజాలు నిగ్గు తేలుస్తాం అని మరి ఇప్పుడేమైంది చంద్రబాబు గారు? అంటూ నిలదీశారు. అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకొని, అధికారం దగ్గర పెట్టుకొని, మౌనంగా ఎందుకు ఉన్నారు ? అదానీ ఒప్పందాలపై ప్రతిపక్షంలో చేసింది నిజమైన ఉద్యమం అయితే, వెంటనే ఏసీబీని మీ పంజరం నుంచి విడుదల చేయండి. రూ.1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఫాస్ట్రాక్ విచారణ జరిపించండి. తక్షణం అదానీతో చేసుకున్న సోలార్ పవర్ డీల్ ను రద్దు చేయండని షర్మిల డిమాండ్ చేశారు.
బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. అదానీ అక్రమ డీల్ పై ఎందుకు పెట్టలేక పోతున్నారు?: ఏపీసీసీ చీఫ్ షర్మిల
By admin1 Min Read
Previous Articleసాయి దుర్గ తేజ్ కొత్త మూవీ అప్డేట్…!
Next Article హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం..!