రాజస్థాన్ రాయల్స్: 173-4 (20).
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 175-1 (17.3).
ఐపీఎల్ సీజన్ 18 లో భాగంగా నేడు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచిన బెంగళూరు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. యశస్వీ జైశ్వాల్ 75 (47; 10×4, 2×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. రియాన్ పరాగ్ 30 (22; 3×4, 1×6) , ధ్రువ్ జురెల్ 35 నాటౌట్ (23; 2×4, 2×6) పరుగులతో ఫర్వాలేదనిపించారు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాళ్, హేజల్ వుడ్, కృనాల్ పాండ్య ఒక్కో వికెట్ తీశారు. అనంతరం బెంగళూరు కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 17.3 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. ఫిలిప్ సాల్ట్ 65 (33; 5×4, 6×6), విరాట్ కోహ్లీ 62 నాటౌట్ (45; 4×4, 2×6), దేవ్ దత్ పడిక్కల్ 40 (28; 5×4, 1×6) టీమ్ ను అలవోకగా గెలిపించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు