ఐపీఎల్ సీజన్ 18 లో భాగంగా గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పైచేయి సాధించింది.గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ 39(32; 1×4, 2×6), అశుతోష్ శర్మ 37 (19; 2×4, 3×6), స్టబ్స్ 31 (21; 2×4, 1×6), కరుణ్ నాయర్ 31 (18; 2×2, 2×6), కే.ఎల్.రాహుల్ 28 (14; 4×4, 1×6) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసీద్ కృష్ణ 4 వికెట్లు, ఇషాంత్ శర్మ, సాయి కిషోర్, సిరాజ్, అర్షద్ లు ఒక్కో వికెట్ తీశారు. అనంతరం గుజరాత్ టైటాన్స్ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. జాస్ బట్లర్ 97 నాటౌట్ (54; 11×4, 4×4), రూథర్ ఫోర్డ్ 43 (34; 1×4, 3×6), సాయి సుదర్శన్ 36 (21; 5×4, 1×6) పరుగులు చేశారు. దీంతో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు