భారత మహిళా క్రికెట్ జట్టు శ్రీలంకలో జరిగిన ట్రై యాంగిల్ సిరీస్ లో విజయం సాధించింది. తాజాగా జరిగిన ఫైనల్ లో శ్రీలంక పై 97 పరుగుల తేడాతో అలవోకగా విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైస్ కెప్టెన్ స్మృతీ మంథాన 116 (101;15×4, 2×6) సెంచరీతో ఆకట్టుకుంది. హర్లీన్ డియోల్ 47 (56;4×4), జెమీమా (44; 29; 4×4), హర్మన్ ప్రీత్ కౌర్ 41 (30; 4×4, 1×6) పరుగులతో రాణించారు. మల్కీ మదార, దేవ్మీ విహంగ , సుగంధిక కుమారి తలో 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక 245 పరుగులకే ఆలౌటైంది. చమరీ ఆటపట్టు 51(66; 6×4, 1×6) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 4 వికెట్లు, అమన్ జ్యోత్ 3 వికెట్లతో సత్తా చాటారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు