ఐపీఎల్ సీజన్ 18 లో ఆఖరి ప్లే ఆఫ్ బెర్త్ ను ముంబై ఇండియన్స్ కైవసం చేసుకుంది. కీలక మ్యాచ్ లో ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై ఇండియన్స్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ 73 నాటౌట్ (43; 7×4, 4×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో ముకేష్ కుమార్ 2 వికెట్లు, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు. ఇక లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటయింది. సమీర్ రిజ్వీ (39) టాప్ స్కోరర్. ముంబై బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు, మిచెల్ శాంట్నర్ 3 వికెట్లతో రాణించారు. అన్ని విభాగాల్లో రాణించిన ముంబై ఇండియన్స్ విజయం సాధించి ప్లే ఆఫ్ లోకి దూసుకెళ్లింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు