త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో తాము ఒంటరిగా పోటీ చేయనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల ఆప్ పై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ విమర్శలు గుప్పించారు. 2013లో ఆ పార్టీకి మద్దతివ్వడం కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పని పేర్కొన్నారు. ఆ కారణంగా ఢిల్లీలో కాంగ్రెస్ బలహీనపడిందని అభిప్రాయపడ్డారు. ఆ పొరపాటును ఇప్పటికైనా సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇది తన అభిప్రాయమేనని అన్నారు. ఢిల్లీ లో పొల్యూషన్ కంట్రోల్, లా అండ్ ఆర్డర్, మౌలిక వసతుల కల్పనలో విఫలమయ్యాయని బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలపై అజయ్ మాకెన్ విమర్శించారు. జన్ లోక్ పాల్ అంశంలో ఆప్ తీరుని ఆక్షేపించారు. దీనిపై కాంగ్రెస్ ఆప్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆప్ నేత సంజయ్ సింగ్ దీనిపై స్పందించారు. తమ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై అజయ్ మాకెన్ హాద్దులు దాటి మాట్లాడారని 24 గంటలలో ఆయనపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని లేకుంటే కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమి నుండి తప్పించేందుకు మిగిలిన పార్టీలతో మాట్లాడుతామని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు