Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం… ఆందోళన వద్దు: కేంద్ర మంత్రి జే.పీ.నడ్డా
    జాతీయం & అంతర్జాతీయం

    పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం… ఆందోళన వద్దు: కేంద్ర మంత్రి జే.పీ.నడ్డా

    By adminJanuary 6, 20252 Mins Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    దేశంలో మూడు హ్యూమన్ మెటానిమో వైరస్ (HMPV) కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా దీనిపై మాట్లాడారు. ఈ వైరస్ కొత్తదేం కాదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో పాటు ఐసీఎంఆర్, ఎన్సీడీసీ నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆరోగ్యపరమైన సవాళ్లపై తక్షణ స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ వైరస్ కాదని ఆరోగ్య రంగ నిపుణులు స్పష్టంచేశారు. ఈ వైరస్ ను 2001లోనే గుర్తించారు. చాలా ఏళ్లుగా ఇది ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిలో ఉంది. గాలి, శ్వాసప్రక్రియ ద్వారా ఇది వ్యాపిస్తుంది. అన్ని వయసుల వారినీ ఇది ప్రభావితం చేస్తుంది. చలికాలంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం చైనాలో ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఆరోగ్యమంత్రిత్వశాఖ, ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చైనాతో పాటు పొరుగు దేశాల్లో పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని త్వరలోనే నివేదికను వెలువరించనుంది. ఐసీఎంఆర్, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ తో దేశంలోని శ్వాసకోశ వైరస్లకు సంబంధిత డేటాను సమీక్షించాయి. సాధారణ వ్యాధికారక వైరస్ లలో ఎలాంటి పెరుగుదల నమోదు కాలేదు. ఈ పరిస్థితిపై సమీక్షించేందుకు జనవరి 4న డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఫర్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ సమావేశం జరిగింది. దేశంలోని ఆరోగ్య వ్యవస్థలు, నిఘా నెట్వర్క్ లు అప్రమత్తంగా ఉన్నాయి. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

    In a statement today, Union Health Minister, Shri @JPNadda has assured that there is no cause for any concern regarding #HMPV cases.

    He stated that that the virus was already identified in 2001 and is not new. The virus is said to spread mainly during winter and early spring.… pic.twitter.com/ypIvcYkSLz

    — Ministry of Health (@MoHFW_INDIA) January 6, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleభారీ నష్టాలతో ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
    Next Article వెంకటేష్ “సంక్రాంతికి వస్తున్నాం” ట్రైలర్ విడుదల…!

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.