ఏపీ ప్రభుత్వం తిరుపతిలో గత రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు అనగాని, హోం మంత్రి వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి ,పార్థసారథి, సత్య కుమార్ తదితరులు పరామర్శించారు. క్షతగాత్రులను పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. ఘటన ప్రమాదమా? కుట్రా? అనే కోణంలో విచారణ చేస్తున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఎవరి వైఫల్యమో సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందని అన్నారు. బాధ్యులు ఏ స్థాయి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా
By admin1 Min Read