తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం పాలన యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలన్నారు. చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం అన్యాయమని ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని వారి ఇంట్లో అర్హులు ఉంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.
మొన్న లడ్డు కల్తీ.. నేడు తొక్కిసలాట. కోట్లాది హిందువుల ఆరాధ్య దేవుడు, కలియుగ దైవం వెంకన్న క్షేత్రానికి మచ్చ తెచ్చి పెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై వెంటనే అత్యున్నత విచారణ జరిపించి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Previous Articleవాయిదా పడిన డాకింగ్ ప్రక్రియ: ప్రకటించిన ఇస్రో
Next Article ఈరోజు కూడా నష్టాల బాట పట్టిన సూచీలు..!