పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అనంతరం ఈరోజు ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి.ఈ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.బడ్జెట్ సమర్పించిన అనంతరం ఉభయసభలు ఈరోజుకి వాయిదా పడ్డాయి.ఈ మేరకు ఉదయం 11 గంటలకు ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాయి.సమావేశాలు ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రభుత్వం సిద్ధమైంది.ఈ సందర్భంగా లోక్సభలో గందరగోళం నెలకొంది.
కాగా యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఇటీవలే తొక్కిసలాట ఘటన జరిగిన విషయం తెలిసిందే.అయితే ఈ ఘటనపై చర్చించాలని విపక్ష పార్టీల ఎంపీలు పట్టుబట్టాయి.వెల్లోకి వచ్చిన విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు.దీనితో సభలో గందరగోళం నెలకొంది.మృతుల జాబితాను విడుదల చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు.అయితే సభలో ఎంపీల తీరుపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభను సజావుగా నడిపేందుకు ప్రతిపక్షాలు ఇష్టపడటం లేదంటూ మండిపడ్డారు.