వరుస నష్టాల నుండి దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో గట్టెక్కాయి. ఈరోజు కూడా ఉదయం నష్టాలలో కదలాడింది సూచీలు ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో స్వల్ప లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 57 పాయింట్లు లాభపడి 75,996గా స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 22,959 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.87 గా కొనసాగుతోంది. ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, అల్ట్రా టెక్ సిమెంట్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.
Previous Articleభారీగా తగ్గిన చక్కెర ఉత్పత్తి…!
Next Article జీబీఎస్ పై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు