ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను అభ్యర్థుల ఆందోళలను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ రాసిన లేఖకు ఏపీపీఎస్సీ తాజాగా బదులిచ్చింది. రేపటి పరీక్షను యధావిధిగా జరుగుతుందని స్పష్టం చేసింది. వాయిదా వేయలేమని పేర్కొంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకోలేమని ఏపీపీఎస్సీ ఈమేరకు స్పష్టం చేసింది. 2023లో గ్రూప్-2 పరీక్షల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం… రోస్టర్ పాయింట్ల విధానంలో తప్పులున్నాయని, వాటిని సరిదిద్దిన తర్వాతే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీకి రాసిన లేఖకు ఈ దశలో పరీక్షను వాయిదా వేయలేమని ఏపీపీఎస్సీ బదులు ఇచ్చింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు