సూడాన్ లోని ఆర్మీ ఎయిర్ బేస్ లో నిన్న రాత్రి విమాన ప్రమాదం సంభవించింది.కాగా టేకాఫ్ కు ప్రయత్నిస్తూ…కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది.అయితే ఈ ప్రమాదంలో పైలట్ తో పాటు విమానంలోని ప్రయాణికులలో 10 మంది దుర్మరణం పాలయ్యారని సూడాన్ అధికార వర్గాలు వెల్లడించాయి.అక్కడి అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.విమానాశ్రయంలోని అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసి, పలువురు ప్రయాణికులను కాపాడారు.సుడాన్ ఖార్టూమ్ సమీపంలోని వాది సీద్నా ఆర్మీ ఎయిర్ బేస్ లో ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో నుండి గాయాలతో బయటపడ్డ ప్రయాణికులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు ప్రాథమిక దర్యాఫ్తులో విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
Previous Articleమరో భాషా యుద్ధానికి సిద్ధం తమిళనాడు సీఎం స్టాలిన్ …!
Next Article ప్రధాని మోదీతో భేటీ అయినా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి