దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో భారీ నష్టాలతో కుదేలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలకు తోడు బ్యాంకింగ్, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్లు ఈ వారాంతంలో భారీగా పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1,414 పాయింట్లు నష్టపోయి 74,612 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 420 పాయింట్ల నష్టంతో 22,124 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.39గా కొనసాగుతోంది. ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.9 లక్షల కోట్లు ఆవిరైంది. సెన్సెక్స్ లో రిజిస్టర్డ్ కంపెనీల విలువ రూ.384 లక్షలకు చేరింది. సెన్సెక్స్ లో హెచ్.డిఎఫ్.సి షేర్లు మినహా దాదాపుగా అన్నీ నష్టాలతో ముగించాయి. అమెరికా ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుండి మార్కెట్లలో అనిశ్ఛితి కొనసాగుతోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు