దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో నేటి ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలకు తోడు మెటల్, ఫైనాన్షియల్ షేర్లు రాణించడంతో సూచీలు భారీ లాభాలతో కళకళలాడాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1131 పాయింట్లు లాభంతో 75,301 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 325 పాయింట్లు లాభపడి 22,834 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.55గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30లో జొమాటో, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టీ షేర్లు ప్రధానంగా లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు చాలా సెషన్స్ నుండి నష్టపోతున్న నేపథ్యంలో పలు రకాల కంపెనీల షేర్లు ఆకర్షణీయంగా ఉండడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం కూడా మార్కెట్ కు కలిసొచ్చింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు