ఇజ్రాయెల్ తాజాగా జరిపిన దాడుల్లో హమాస్కు చెందిన కీలక నేత, అక్టోబర్ 7 నాటి ఊచకోత సూత్రధారి సలాహ్ అల్-బర్దావిల్ హతమయ్యాడు. ఈ విషయాన్ని హమాస్ ధ్రువీకరించింది.హమాస్ మీడియా సలహాదారు తాహెర్ అల్ నోనో కూడా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు. బర్దావిల్, ఆయన భార్య వారి స్థావరంలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడుల్లో మరణించినట్టు తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్న కారణంతో హమాస్ పై ఇజ్రాయెల్ వరుస దాడులతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. గత వారం గాజాపై జరిపిన దాడిలో 400 మందికి పైగా మృతి చెందారు. కాల్పుల విరమణ ఒప్పందం మార్పులను హమాస్ తిరస్కరించడంతోనే దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల తెలిపారు. కాగా, ఇజ్రాయెల్ దాడులను హమాస్ తీవ్రంగా ఖండించింది. బందీలను విడిచిపెట్టకుంటే గాజాలోని భూభాగాలను ఒక్కొక్కటిగా ఆక్రమిస్తామని ఇజ్రాయెల్ రక్షణమంత్రి కాట్జ్ హమాస్ ను తీవ్రంగా హెచ్చరించారు.
Previous Articleడబ్ల్యూటీసీ పాయింట్లపై నిర్ణయం తీసుకోనున్న గంగూలీ కమిటీ
Next Article షహీద్ దివస్ సందర్భంగా వీరులకు ప్రముఖుల నివాళులు