భారత్ తో పాటు 75 ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్ లకు 90 రోజులు బ్రేక్ ఇస్తూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి . అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్ నడుస్తున్నా ఆ ప్రభావం మన మార్కెట్ల పై పడలేదు.
నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1310 పాయింట్లు లాభపడి 75,157 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 429 పాయింట్లు లాభంతో 22,828 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 86.08గా ఉంది. నేటి ట్రేడింగ్ లో టాటా స్టీల్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ షేర్లు లాభాలతో ముగిశాయి. ఫార్మా, మెటల్ స్టాక్స్ రాణించాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు