ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ https://resultsbie.ap.gov.inలో చూసుకోవవచ్చని తెలిపారు. అలాగే మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009కు “హాయ్” సందేశం పంపడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చని వివరించారు.
ఈ ఏడాది మొదటి సంవత్సరంలో 70 శాతం, రెండో సంవత్సరంలో 83 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రభుత్వ నిర్వహణలోని విద్యా సంస్థలలో ఉత్తీర్ణత పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 10 సంవత్సరాల గరిష్ట స్థాయి (69 %)కి చేరుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం విద్యార్థులు, జూనియర్ లెక్చరర్ల కృషికి నిదర్శనమని అన్నారు.
ఉత్తీర్ణత సాధించని వారు నిరుత్సాహపడకుండా, దీన్ని ఒక మెట్టుగా ఉపయోగించుకొని మరింత కష్టపడి చదవాలన్నారు. విద్యార్థుల ఎప్పుడూ పోరడటాన్ని ఆపకూడదని, విజయం కోసం ప్రయత్నించడంలో తప్పులేదని మంత్రి లోకేష్ స్థైర్యాన్ని నింపారు.
🚨 Results for the Intermediate Public Examinations are now out. 🚨
Students can check their results online at https://t.co/UDtk11bzit. Also, results can be accessed by sending a "Hi" message to the Mana Mitra WhatsApp number at 9552300009.
Glad to share that this year’s IPE… pic.twitter.com/Ty2hpGkRiV
— Lokesh Nara (@naralokesh) April 12, 2025