విజయవాడ నుండి విశాఖపట్నం మధ్య ఉదయపు విమాన సర్వీస్ జూన్ 1 నుండి తిరిగి ప్రారంభం కానున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ రూట్ ఆంధ్రప్రదేశ్ రవాణా అనుసంధానం లో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని లోని విజయవాడను, ఆర్థిక కేంద్రమైన విశాఖపట్నంతో ఇది కలుపుతుందని అన్నారు. ప్రాంతీయ విమాన కనెక్టివిటీని బలోపేతం చేయడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రయాణీకుల సౌలభ్యం కోసం మరియు రాష్ట్రాభివృద్ధి దృష్ట్యా ఈ కీలకమైన విమాన సేవ మళ్లీ ప్రారంభమవడం ఆనందంగా ఉందని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇక సవరించిన షెడ్యూల్ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని అందించనుంది. ఇండిగో విమానం ఉదయం 7:15 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి, ఉదయం 8:25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, విమానం ఉదయం 8:45 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి, ఉదయం 9:50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

