భారత్, పాకిస్థాన్ల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. పాకిస్థాన్ దళాలు సరిహద్దు ప్రాంతాలపై దాడులకు పాల్పడటం, భారత సైన్యం వాటిని సమర్థంగా తిప్పికొట్టడంతో యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో దేశీయ సూచీలు వరుసగా రెండో రోజూ కూడా భారీ నష్టాలను చవిచూశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 880 పాయింట్లు నష్టపోయి 79,454 వద్ద స్థిరపడగా… నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ కూడా దాదాపు 265 పాయింట్ల నష్టంతో 24,008 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.85.41గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు