భారత్ లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని 8వ తేదీ రాత్రి నుండి పాకిస్థాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. నేటి తెల్లవారుజామున అమృత్సర్ లోని ఖాసా కంటోన్మెంట్ గగనతలంలో మన సెక్యూరిటీ ఫోర్సెస్ శత్రు డ్రోనును గుర్తించాయని ఆర్మీ అధికారులు తెలిపారు. ఎయిర్ డిఫెన్స్ విభాగాలు వెంటనే దాన్ని కూల్చివేశాయని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను, చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ పైనా డ్రోన్లతో దాడికి పాక్ యత్నించినట్లు తెలుస్తోంది. శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. శ్రీనగర్ ఎయిర్ బేస్ పై డ్రోన్లతో దాడి చేయగా.. సైన్యం వీటిని విజయవంతంగా తిప్పికొట్టింది. చండీగఢ్ లోనూ తెల్లవారుజామున దాడులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. పఠాన్కోట్లో ఉదయం 5 గంటలకు భారీ పేలుళ్ల శబ్దాలు వచ్చినట్లు తెలిపారు. జమ్మూ నుండి గుజరాత్ వరకు పలుచోట్ల పాక్ దాడులకు పాల్పడగా.. భారత సైన్యం వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు సైరన్లు మోగిస్తూ ప్రజలను అలెర్ట్ చేశారు.
OPERATION SINDOOR
Pakistan’s blatant escalation with drone strikes and other munitions continues along our western borders. In one such incident, today at approximately 5 AM, Multiple enemy armed drones were spotted flying over Khasa Cantt, Amritsar. The hostile drones were… pic.twitter.com/BrfEzrZBuC
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 10, 2025