దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో సూచీలకు ఉత్తేజాన్ని ఇచ్చింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ రాణించాయి. భారత్ -అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సహా అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 256 పాయింట్లు లాభంతో 82,445 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 25,103 వద్ద ముగిసింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.85.66గా కొనసాగుతోంది. ఇక సెన్సెక్స్ 30లో యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలతో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు