‘ఆపరేషన్ సిందూర్’ తదితర పరిణామాలను వివరించేందుకు వివిధ దేశాల్లో భారత్ కు చెందిన వివిధ పార్టీల నేతలు బృందాలుగా పర్యటించి ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటాన్ని వివరించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ పర్యటనలో పాల్గొని వచ్చిన ఏడు బృందాల ప్రతినిధులతో ప్రధాని మోడీ తాజాగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతినిధులు తమ పర్యటన విశేషాలను ప్రధానికి వివరించారు. భారత దేశం శాంతిని కోరుకుంటుందని, ప్రపంచానికి పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పును తొలగించాల్సిన అవసరముందని వివిధ దేశాలకు మన బృందాలు వివరించిన తీరు అద్భుతమని ప్రధాని మోడీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రధానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. శశిథరూర్, సుప్రియా సూలే, కనిమొళి, రవిశంకర్ ప్రసాద్, శ్రీకాంత్ షిండే తదితరులు ఉన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు