భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ లో పర్యటిస్తున్నారు. బ్రిటన్ తో కీలక వాణిజ్య ఒప్పందం తరువాత ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. క్రికెట్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదని, అది ఒక ప్యాషన్ అని అన్నారు. క్రికెట్ మాదిరిగా భారత్-బ్రిటన్ దేశాల మధ్య దీర్ఘకాల భాగస్వామ్యం కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో భారత్-బ్రిటన్ భాగస్వామ్యంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. రెండు దేశాలు విజన్-2035 లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. డిఫెన్స్, సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఎడ్యుకేషన్, సైబర్ సెక్యూరిటీ, ఇతర రంగాల్లో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలిపారు. 6 బ్రిటన్ వర్సిటీలు భారత్ లో క్యాంపస్ లు ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు. భారత్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన బ్రిటన్ ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తీవ్రవాదంపై పోరులో రెండు అభిప్రాయాలకు చోటు లేదు. ప్రజాస్వామ్య స్వేచ్ఛను దుర్వినియోగం చేసేవారి పట్ల కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల మధ్య శాంతి పెంపొందించే విషయంలో భారత్-బ్రిటన్ కలిసి ముందుకు సాగుతాయన్నారు. ఇది విస్తరణ వాదానికి కాలం కాదని ఇది శాంతికి సమయమని మోడీ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపైనా ప్రధాని మోడీ స్పందించారు. అహ్మదాబాద్ విమాన దుర్ఘటనలో బ్రిటన్ లోని ఎన్నారైలు కూడా ఉన్నారు. విమాన ప్రమాద మృతులకు మరోసారి సంతాపం తెలిపారు. ఎన్నారైలు భారత సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నారు. బ్రిటన్ ప్రధాని ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఆయనను భారత్ కు రావాలని ఆయనను ఆహ్వానించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు