అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి పెంచిన టారిఫ్ ల ప్రభావం భారత్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. నేటి ట్రేడింగ్ లో ప్రారంభంలో నష్టాల్లో కదలాడినా ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి దూసుకెళ్లాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు మార్కెట్ కు కలిసొచ్చాయి. ట్రంప్ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదు. మన ఎకానమీ పై ఇన్వెస్టర్లకు ఉన్న విశ్వాసం కూడా సూచీలకు దన్నుగా నిలిచింది. నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 79 పాయింట్ల లాభంతో 80,623 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 22 పాయింట్ల లాభపడి 24,596 వద్ద ముగిసింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.87.69గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30లో టెక్ మహీంద్రా, హెచ్.సీ.ఎల్. టెక్నాలజీస్, ఎటర్నల్ ,యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకి షేర్లు లాభాలతో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు