ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.ఈ మేరకు ఆయన పలువురు దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.ఈ అంశంలో భాగంగానే, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తో భేటి అయ్యారు.నా స్నేహితుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ను కలవడం ఎంతో సంతోషంగా ఉందనీ ప్రధాని అన్నారు.భారత్, ఫ్రాన్స్లు అంతరిక్షం, ఎనర్జీ, ఏఐ వంటి ఇతర రంగాలలో సన్నిహితంగా పనిచేయడంపై చర్చించామని తెలిపారు.ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను బలపరిచేందుకు కృషి చేస్తాం అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్టు చేశారు.అంతేకాకుండా ఈ ఏడాది ప్రారంభంలో పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ను సమర్థంగా నిర్వహించారని మెక్రాన్ ను ప్రధాని ప్రశంసించారు.ఈ సమావేశం భారత్- ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది.బ్రెజిల్లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ 20 సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు.
It is always a matter of immense joy to meet my friend, President Emmanuel Macron. Complimented him on the successful hosting of the Paris Olympics and Paralympics earlier this year. We talked about how India and France will keep working closely in sectors like space, energy, AI… pic.twitter.com/6aNxRtG8yP
— Narendra Modi (@narendramodi) November 18, 2024

