నిన్న నష్టాలతో డీలా పడిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. ట్రేడింగ్ ఆరంభంలో ఫ్లాట్ గా ప్రారంభమై ఇంట్రాడేలో భారీగా లాభపడ్డాయి. పలు షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు జోష్ ఇచ్చింది. దీంతో ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 759.05 పాయింట్ల లాభంతో 79,802.79 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 216.95 పాయింట్ల లాభంతో 24,131.10 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.49గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, , మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు