ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైస్సార్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.అయితే ఈ కేసులో భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసింది.అనంతరం భాస్కర్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరూతూ…వైస్ వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు వేశారు.
సునీత పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది.ఈ నేపథ్యంలోనే ప్రతివాదులు భాస్కర్ రెడ్డి, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది.గతంలో సీబీఐ దాఖలు చేసిన భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ను సునీత పిటిషన్ తో జతచేస్తూ…ఉత్తర్వులు ఇచ్చింది.తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి తోలి వారానికి వాయిదా వేసింది.