ప్రతీ ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని ఎక్స్ లో పోస్ట్ చేశారు.భారత్తో సహా పలు దేశాలు తీర్మానాన్ని ప్రతిపాదించగా…ప్రతీ ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
అయితే సమగ్ర,శ్రేయస్సు,అంతర్గత పరివర్తన కోసం డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని జరుపుకునేందుకు భారత్తో పాటు మరికొన్ని దేశాలు ఈ తీర్మానం చేసాయి.వీటిని ఐక్యరాజ్య సమితి ఏకగ్రీవంగా ఆమోదించింది.డిసెంబర్ 21 చాలా పవిత్రమైన రోజు అని.. యావత్తు ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్ పాటుపడుతుందని అన్నారు.వసుదైక కుటుంబం అనే నాగరికత నుండి భారత్ వచ్చిందని హరీష్ పర్వతనేని వ్యాఖ్యానించారు.
A day for comprehensive well being and inner transformation!
Glad that India alongwith other nations of the core group guided the unanimous adoption of the resolution on declaration of 21 December as World Meditation Day @UN General Assembly today.
India’s leadership in… pic.twitter.com/4ARgXw4yXm
— Parvathaneni Harish (@AmbHarishP) December 6, 2024