సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో నిన్న అరెస్టయిన ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు. నాంపల్లి కోర్టు14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. కాగా, తెలంగాణ హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ న్యాయవాదులు రూ.50వేల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్ కు సమర్పించారు. అయితే హైకోర్టు నుండి బెయిల్ పత్రాలు జైలు అధికారులకు నిన్న రాత్రి ఆలస్యంగా అందాయి. దీంతో అల్లు అర్జున్ రాత్రంతా జైలులోనే గడపాల్సి వచ్చింది. ఇక నేటి ఉదయం ఎస్కార్ట్ వాహనం ద్వారా ఆయనను పంపించారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ భదత్ర ఏర్పాటు చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు